SKLM: మందస మండలంలో సాగునీటి భద్రత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. టీడీపీ మందస మండల అధ్యక్షులు భావన దుర్యోధన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం మందస జన చెరువు దగ్గర కార్యక్రమం నిర్వహించారు. సాగునీటి సంఘాల అధ్యక్షులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరారు. ఏప్రిల్ 21 నుండి జూలై 14వ తేదీ లోపల పనులన్నింటినీ పూర్తి చేయాలని తెలిపారు.