CTR: జీడినెల్లూరు మండలం వి.బందార్లపల్లెలో శ్రీపట్టాభి రామస్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గరుడ వాహన సేవ నిర్వహించారు. స్వామి వారిని గరుడ వాహనంపై కొలువుదీర్చి పూజలు చేశారు. తర్వాత గ్రామంలో ఊరేగించారు. గ్రామస్తులు కాయాకర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.