TG: సిద్ధిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు బాల్ రెడ్డి దారుణహత్యకు గురయ్యారు. మారణాయుధాలతో బాల్ రెడ్డిని దుండగులు హత్య చేశారు. దుబ్బాక మండలం రాజక్కపేట శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. బైకుపై రాజక్కపేట నుంచి చెల్లాపూర్లోని ఇంటికి వెళ్తుండగా దాడి చేశారు. ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు క్లూస్ టీమ్, పోలీసులు చేస్తున్నారు. రాజకీయ కక్షలు, భూవివాదం కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.