AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనపై కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు స్పందించారు. 9 మంది బాధితులు ఆస్పత్రిలో చేరారని, అందులో ఏడుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారని వెల్లడించారు. బాధితులందరికీ చికిత్స అందిస్తున్నామని, వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని స్పష్టం చేశారు. అత్యవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిస్తామని తెలిపారు.