TG: ఏపీలోని కాకినాడ జిల్లా వేట్లపాలెం ప్రమాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని కోరారు. ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.