MDK: మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో శనివారం రెండు దూడలపై చిరుత పులి దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన ఆకుల సుధాకర్, బావని ఐలయ్య పొలాల వద్ద ఉన్న రెండు దూడలపై దాడి చేసి చంపినట్లు వివరించారు. అటవీ శాఖ సహాయ రేంజ్ అధికారి చంద్రశేఖర్కు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.