KMM: నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ ఆదివారం ఖమ్మం నగరంలో పర్యటించనున్నట్లు జిల్లా బీజేపీ నాయకులు జాటోత్ మధునాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా సా.3 గంటలకు ఎస్టీ కమిషన్ సభ్యులు వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులను పరామర్శిస్తారని చెప్పారు. అనంతరం భూదాన్ భూముల్లో కూల్చివేసిన ఇళ్లను పరిశీలిస్తారని పేర్కొన్నారు.