W.G: రాష్ట్రంలో స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలం తేతలి గ్రామ శివారు కొండాయపాలెం గ్రామంలో శనివారం స్వచ్ఛ రథాలను ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు.