TG: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో సమీపంలో విద్యుత్ స్తంభాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. బస్సులో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సంఘటన స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది చాలాసేపు ప్రయాసపడి అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.