VZM: ALL INDIA SAINIK EXAMలో ఎస్.కోట మండలం దొగ్గపేట ఎంపీపీ పాఠశాలలో చదువుతున్న 5వ తరగతి విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు HM బీ సురేష్ శనివారం తెలిపారు. వజ్రపు శశి కుమార్ 267/300, చుక్కా శశాంక్ 241/300, తొత్తడి రిషిత 227/300 మార్కులు సాధించినట్లు తెలిపారు. వీరి ప్రతిభకు కారణమైన ఉపాధ్యాయులను విద్యార్థులు తల్లిదండ్రులు, స్థానికులు అభినందించారు.