నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో శుక్రవారం ఇంటర్మీడియట్ మూల్యాంకన కేంద్రాన్ని జిల్లా మాధ్యమిక విద్యాశాఖ అధికారి పరుశురామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మూల్యాంకనాన్ని అధ్యాపకులు పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సీసీవో సుదర్శన్, ఏసీవో తుకారం, అధ్యాపకులు విజయలక్ష్మి, నవీన్ కుమార్, గౌతమ్లు పాల్గొన్నారు.