BDK: టేకులపల్లి మండల కేంద్రంలో TSTTF ఉపాధ్యాయ సంఘం ముఖ్య నాయకులు శుక్రవారం సమావేశమయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆకునూరి మురళి ఛైర్మన్ విద్యా కమిషన్ నివేదించిన రిపోర్టును పరిశీలిస్తే ఉద్యోగ ఉపాధ్యాయులను అవమానించినట్టుగా ఉందని మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోకుండా నివేదిక ఇవ్వడం సరికాదన్నారు.