సత్యసాయి: లేపాక్షి మండలంలోని కంచి సముద్రం నుంచి కర్ణాటకకు వెళ్లే ప్రధాన రహదారి భారీ గుంతలతో ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. రహదారి దుస్థితితో వాహనదారులు, విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యపై సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రహదారిని వెంటనే మరమ్మతు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.