MBNR: రోడ్డు ప్రమాదాల నివారణకు వేగాన్ని నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు మహబూబ్ నగర్ రెండవ పట్టణ సీఐ ఐజాజుద్దీన్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలలో స్పీడ్ బ్రేకర్లు, కాషన్ బోర్డులు ఏర్పాటుకు స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో మొత్తంగా 40 ప్రాంతాలలో బ్లాక్ స్పాట్స్ గుర్తించామన్నారు.