ATP: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, శిథిలావస్థ భవనాల కింద నిలబడవద్దని హెచ్చరించారు.