MNCL: జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని జన్నారం రేంజ్ ఎఫ్ఆర్వోగా బాబా ఖదీర్ వలి బాధ్యతలు చేపట్టారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని ఎఫ్ఆర్వో కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ఎఫ్ఆర్వో మాట్లాడుతూ.. అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు అధిక ప్రాధాన్య ఇస్తానని తెలిపారు. ప్రజలు కూడా అటవీశాఖ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.