BDK: నేటి యువత క్రీడల్లో తమ శక్తి సామార్థ్యాలతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మండల పరిధిలోని నారాయణరావుపేటలో యర్రపోతు పుల్లయ్య మెమోరియల్ కప్, సంతోష్ కుమార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాల్వంచ, మండల స్థాయి క్రీడా పోటీలను శుక్రవారం ప్రారంభించారు.