RR: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమైందని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో షాద్నగర్ నియోజకవర్గంలోని సర్పంచ్లకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు ఆయన హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్యం, మౌలిక వసతుల ఏర్పాట్లకు ముందుండి ప్రజలను మెప్పించి మరింత ఉన్నత పదవులకు చేరుకోవాలన్నారు.