HYD: డయాలసిస్ కోసం వచ్చిన సాగర్ మృతిచెందడంతో పుప్పాలగూడలోని మెడికవర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఘటనపై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు వైద్యులతో ప్రత్యేక బృందం పోస్టుమార్టం నిర్వహించారు.