KRNL: ఆదోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు చేతుల మీదుగా 70 మంది లబ్ధిదారులకు రూ. 27,56,659 విలువైన ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.