VSP: ప్రభుత్వ అధికారులమని నమ్మించి రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.1.05 కోట్లు కాజేసిన కేసులో ఆరుగురు నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆధార్ కేసుల పేరుతో బాధితుడిని భయపెట్టి విడతల వారీగా డబ్బు వసూలు చేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్లు అందిస్తూ కమిషన్లు పొందుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశానన్నారు.