PDPL: రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ను పెద్దపల్లి మున్సిపల్ ఛైర్మన్ నుగిళ్ల మల్లయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను ఆత్మీయంగా కలిసి, ఈ సందర్భంగా పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులు, పార్టీ బలోపేతం, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు. ఆయన అనుచరులు, పలువురు పాల్గొన్నారు.