NRPT: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా మక్తల్లో ‘అరైవ్-అలైవ్’ రెండో విడత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 80 మంది ఆటో టాక్సీ డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షలు చేశారు. డ్రైవర్లు ఆరోగ్యంపై ముఖ్యంగా కంటి చూపుపై శ్రద్ధ వహిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయని ఎస్ఐ సూచించారు. భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని ఆమె కోరారు.