TG: తాను BJPలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎంతో గౌరవించిందని కాంగ్రెస్ MLA రాజగోపాల్ రెడ్డి అన్నారు. BJPలో తనకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, స్టేట్లో స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ ఇచ్చారన్నారు. కానీ కాంగ్రెస్ కన్నతల్లిలాంటిదని తిరిగి వచ్చానన్నారు. మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డి గెలిచి ఉంటే రాష్ట్ర రాజకీయం మరోలా ఉండేదని.. CPI నేత నెల్లికంటి సత్యం చెప్పిన మాటలను గుర్తుచేశారు.