‘ఎల్లమ్మ’ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ మూవీపై DSP ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంగీత దర్శకుడిగా అత్యంత బిజీగా ఉన్నప్పటికీ.. ఈ మూవీ కోసం నెలలో కేవలం 10 రోజులు పనిచేస్తానని చెప్పాడు. అందుకోసం నిర్మాత దిల్ రాజుతో ప్రత్యేక ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలిపాడు. ఇక ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.