HYD: మహానగరంలో “మసాజ్ సెంటర్ల” పేరుతో వ్యభిచారం నడుస్తున్నట్లు పలు కేసుల్లో వెలుగుచూసింది. రూ. లక్ష వరకు ఇస్తామని చెప్పి బంగ్లాదేశ్, థాయిలాండ్ ప్రాంతాల నుంచి మహిళలను నిర్వాహకులు రప్పిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్యూటీ పార్లర్ ముసుగులోనూ ఈ అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయి. ఇలాంటి వాటిపై పోలీసులు నిరంతర నిఘా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.