AKP: ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెలలో నక్కపల్లిలో పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ విజయ కృష్ణన్ నక్కపల్లిలో అధికారులతో సమీక్షించారు. కాగిత గ్రామం వద్ద హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. భద్రత ఏర్పాట్లు, రహదారి సౌకర్యం, తాత్కాలిక వసతులు కల్పనపై ఆమె అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. భద్రత చర్యలను కట్టుదిట్టం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.