ప్రకాశం: మార్కాపురం మండలం పెద్ద నాగులవరం గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు యత్నించిన ఘటనపై తహసీల్దార్ చిరంజీవి కఠిన చర్యలు తీసుకున్నారు. సర్వే నం.173-2లో ఉన్న 15 సెంట్ల భూమిని సయ్యద్ అబ్దుల్ రవూఫ్ ఆక్రమించేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదు రావడంతో జేసీబీ సహాయంతో హద్దురాళ్లను తొలగించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ తెలిపారు.