ASR: పాడేరు మోదకొండమ్మ అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ టీ.నిశాంతి తెలిపారు. నిన్న కలెక్టరేట్లో ఉత్సవ ఏర్పాట్లపై సమావేశమయ్యారు. ప్రభుత్వ ఆదేశాలతో, రాష్ట్ర స్థాయి వేడుకలకు అనుగుణంగా పండుగ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులను, కమిటీ సభ్యులను ఆదేశించారు. పండుగ నిర్వహణకు కలెక్టర్ రూ.50వేలు అందజేశారు.