NGKL: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం భగీరథ మహర్షి జయంతిని అధికారికంగా నిర్వహించారు. కలెక్టర్, ఉన్నత అధికారులు భగీరథ మహర్షి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. భగీరథ మహర్షి తరతరాలకు స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. భగీరథ మహర్షి చరిత్ర యువతరం అధ్యయనం చేయాలని సూచించారు.