KNR: వచ్చే నెల 14 నుంచి పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఉపాధ్యాయులకు సూచించారు. చింతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం అడిషనల్ కలెక్టర్ సందర్శించి 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలు సమీపిస్తున్నందున రోజు విధిగా పాఠశాలకు రావాలని సూచించారు.