GNTR: రాష్ట్ర ప్రభుత్వం జనన, మరణాల నమోదుపై జీవోఎంఎస్ 28 ద్వారా కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు కమిషనర్ మయూర్ అశోక్ బుధవారం తెలిపారు. జనన లేదా మరణం జరిగిన 21 రోజుల్లోపు ఉచితంగా నమోదు చేసుకోవచ్చని, ఆ తర్వాత నిర్ణీత ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఒకవేళ 21 రోజులు దాటితే, రూ. 25 అపరాధ రుసుముతో 30 రోజులలోపు నమోదు చేసుకోవచ్చని వివరించారు.