అల్లూరి జిల్లా ఏజెన్సీ వారపు సంతలో చింతపండు ధరలు భారీగా పడిపోయాయి. గత వారం రూ.1400–1600 ఉన్న 20 కిలోల గంప ఈ వారం రూ.600–800కే పడింది. కొనుగోలుదారులు లేక రైతులు సరుకును తిరిగి తీసుకెళ్లాల్సి వస్తుంది. జీసీసీ కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారుల ఇష్టారాజ్యమని గిరి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా GCC ద్వారా కొనుగోలు చేయాలని కోరుతున్నారు.