HYD: ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న అపూర్వ ప్రగతికి ఆకర్షితులై BJPలోకి చేరికలు కొనసాగుతున్నాయని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. ఇవాళ రాష్ట్ర కార్యాలయంలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన పలువురు BJPలో చేరారు. వారికి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెద్ద ఎత్తున యువత దేశ సేవలో భాగస్వాములు కావడానికి ముందుకు రావడం హర్షినీయమన్నారు.