కృష్ణా: చల్లపల్లి మండలంలో రెండు ప్రధాన రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి హామీ పథకం నిధులతో నడకుదురు శివారు రాముడుపాలెం ప్రధాన రహదారి బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.49 లక్షలు, నాదెళ్లవారిపాలెం రోడ్డు నిర్మాణానికి రూ. 49 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.