TPT: దొరవారిసత్రంలో ఇవాళ ఉదయం ఎస్సై జీవీ చౌదరి మీడియాతో సమావేశం నిర్వహించారు. రోడ్ మీద ట్రాఫిక్ నియంత్రణ, గంజాయి రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టి, నిర్లక్ష్యానికి తావులేదని హెచ్చరించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఎలాంటి ఉపేక్ష ఉండదని హెచ్చరించారు.