విశాఖ: జీవీఎంసీ 63వ వార్డు, క్రాంతి నగర్ గ్రామంలో చిన్నారులు కోసం ఏర్పాటు చేసిన పార్కు చుట్టుపక్కల భవన నిర్మాణ వ్యర్ధాలు వేయడం వలన పార్కులో క్రీడలు ఆడుకునే వారికి గాయాలు అవుతున్నాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు. పార్కు చుట్టుపక్కల రక్షణ గోడ లేకపోవడం వలన పార్కు కబ్జాకు గురవుతుందని ఆవేదన చెందుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.