NZB: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్యను అదనపు డీసీపీ (అడ్మిన్) నగ్రాలే శుభం ప్రకాష్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీకి పూల మొక్కను అందజేయగా, ఆయన ఆత్మీయంగా స్వాగతించి అభినందనలు తెలిపారు. శాఖాపరమైన సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పరస్పర సహకారం అవసరమని సీపీ పేర్కొన్నారు. పరిపాలన అంశాలపై చర్చించారు.