VSP: భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు టీడీపీలో తీవ్ర నిరాశ ఎదురైంది. ఇటీవల టీడీపీ ప్రకటించిన జాతీయ, రాష్ట్ర కమిటీలతో పాటు కీలకమైన పొలిట్ బ్యూరోలోనూ ఆయనకు, ఆయన కుమారుడు రవితేజకు పార్టీ అధిష్ఠానం మొండి చేయి చూపింది. మంత్రివర్గంలో స్థానం దక్కించుకోలేకపోయిన గంటా తాజాగా పార్టీ పదవుల్లోనూ ఎలాంటి ప్రాధాన్యం లభించకపోవడంతో నిరాశకు గురయ్యాయి.