ELR: అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన దార్శనికుడు డా.బీ.ఆర్ అంబేద్కర్ అని జేసీ అభిషేక్ గౌడ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ల్లో అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ప్రజలందరూ స్వేచ్ఛా స్వాతంత్రాలతో జీవిస్తున్నారంటే అంబేద్కర్ రాజ్యంగంలో మనందరికీ కల్పించిన హక్కులేనని జేసీ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.