SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రులు హైదరాబాద్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి మొత్తం నాలుగు దశల్లో పూర్తవుతుందన్నారు.