PPM: విద్యార్దులు మాదకద్రవ్యాల వైపు మొగ్గు చూపకుండా విద్యపైనే దృష్టి సారించాలని పాలకొండ DSP రాంబాబు సూచించారు. సోమవారం మాదక ద్రవ్యాల నివారణపై పాలకొండలో విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీసు స్టేషన్ నుంచి ర్యాలీగా వెళ్లి RTC కాంప్లెక్స్ వద్ద మానవ హారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు వదిలితే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు.