సత్యసాయి: కదిరిలో ఆదివారం ఉదయం ‘ఆపరేషన్ వజ్ర ప్రహార్’ నిర్వహించారు. డీఎస్పీ శివ నారాయణస్వామి పర్యవేక్షణలో యర్రగుంటపల్లి, కుమ్మరోళ్లపల్లి ప్రాంతాల్లో పోలీసులు కార్డాన్ అండ్ సెర్చ్ చేపట్టారు. గంజాయి, మట్కా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిఘా ఉంచి 12 వాహనాలను తనిఖీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని సీఐ నారాయణరెడ్డి సూచించారు.