KRNL: ఇంటర్మీడియెట్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయని సోమవారం ఆర్ఐవో జి. లాలెప్ప తెలిపారు. కాగా, దీనిపై ఇప్పటివరకు అధికారిక ఉత్తర్వులు వెలువడలేదన్నారు. అటు, ఫస్ట్ ఇయర్ పరీక్షలు పూర్తి చేసి సెకండియర్లోకి ప్రవేశించిన విద్యార్థులకు ఈ నెల 1 నుంచే 2026-27 విద్యాసంవత్సరం ప్రారంభమైందన్నారు.