KRNL: ఆదోని శుక్రవారం పేటలో సర్వే నంబర్ 315లోని 4 ఎకరాలు 2 సెంట్ల దేవాలయ భూమిని వైసీపీ నాయకుడు రఘునాథ్ అక్రమంగా కబ్జా చేశారని ఇవాళ బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనను ఖండిస్తూ బీజేపీ నార్త్ మండలం ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. దేవాలయ ఆస్తులను రక్షించి భూమిని తిరిగి ప్రజలకు అప్పగించాలని ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు.