SKLM: ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను పోలీసు అధికారులు మంగళవారం సందర్శించారు. మందస గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలిగాంలో ఆదిత్య కళాశాల పరీక్షా కేంద్రాలను కాశీబుగ్గ రూరల్ సీఐ ఎం.తిరుపతిరావు, మందస ఎస్సై కె.కృష్ణ ప్రసాద్లు పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.