AP: రాబోయే రోజుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ను విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడవచ్చని టీడీపీ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఆరోపించారు. తన మనస్తత్వంతో ప్రజల్లో జగన్ విశ్వాసం కోల్పోయారన్నారు. అహంకార ధోరణి వల్ల అధికారం కష్టమనే భావన.. వైసీపీ నాయకుల్లో పెరుగుతుందన్నారు. 60 రోజుల అసెంబ్లీ గైర్హాజరుతో అర్హత కోల్పోయే భయం వైసీపీ ఎమ్మెల్సీల్లో ఉందని పేర్కొన్నారు.