NTR: జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామంలో పల్లె పండగ 2.0 కార్యక్రమం కింద నిర్మించిన గోశాలను (కమ్యూనిటీ గోకులం) ను కలెక్టర్ లక్ష్మీశ సోమవారం పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.రూ.10 లక్షలతో నిర్మించిన గోశాల గ్రామంలోని పాలు ఉత్పత్తి చేసే రైతులకు మేలుకలుగుతుందని, పశుసంవర్థక రంగం అభివృద్ధికి తోడ్పడుతుందని కలెక్టర్ తెలిపారు.