MNCL: ఇంటర్ పరీక్ష రాసే విద్యార్థులు గంటముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని లక్షెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణరావు సూచించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ పరీక్ష రాసే విద్యార్థులకు హాల్ టికెట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయని, పరీక్షా ప్యాడ్, హాల్ టికెట్, పెన్నులను తెచ్చుకోవాలని సూచించారు.