టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దేవస్థానం ప్రతిష్టను దిగజారుస్తున్నారని సత్తెనపల్లి పట్టణంలో వైసీపీ ఇంఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న ఆయన వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కేవలం పబ్లిసిటీ కోసమే చంద్రబాబు ఆయనను కొనసాగిస్తున్నారా అని ప్రశ్నించారు.